
సినిమాలు

బీజేపీలో చేరే ఆలోచన తనకు లేదని మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నానని, మూడు, నాలుగు నెలల్లో పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. కొత్త పార్టీ పేరు, విధివిధానాలు, రాజకీయ కార్యాచరణపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.
టీడీపీ, వైసీపీతో పాటు రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై కూడా మాట్లాడతానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయా పార్టీలు రాష్ట్రాన్ని ఎలా నష్టపరుస్తున్నాయో, మత రాజకీయాలను ఎలా ప్రోత్సహిస్తున్నాయో ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!