
జనరల్

న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసనలను విరమించబోమని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ ఆందోళనలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతుండటంతో పరిస్థితులపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులు రాజధానిలోని కీలక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. జనసమ్మర్థాన్ని నియంత్రించేందుకు సెంట్రల్ ఢిల్లీలోని 17 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!